యాప్నగరం

జనసేన సభలో కలకలం.. కరెంట్ షాక్‌తో ఇద్దరికి గాయాలు

అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి సభా వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తోంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే నిర్వాహకులు అప్రమత్తమై జనరేటర్‌ను ఆపివేశారు.

Samayam Telugu 3 Nov 2019, 5:57 pm
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ సభలో విద్యుత్ షాక్ కలకలం రేపింది. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన ఐరన్ బ్యారీకేడ్లను పట్టుకున్న పలువురికి విద్యుత్ షాక్ కొట్టడంతో గాయాలయ్యాయి. సభా వేదికపై నుంచి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తుండగా హఠాత్తుగా అలజడి రేగింది. విద్యుత్ షాక్‌తో పలువురు పడిపోవడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.
Samayam Telugu shock


Also Read: పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌.. ఏపీ బీజేపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి సభా వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా కరెంట్ షాక్ కొట్టినట్లు తెలుస్తోంది. విద్యుత్ షాక్ తగిలిన వెంటనే నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. జనరేటర్‌ను తక్షణమే ఆపివేశారు. కరెంట్ షాక్‌కు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని జనసేనాని పవన్ ఆదేశించారు. వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

తొలుత విశాఖ నగరంలోని మద్దిలపాలెం వద్దనున్న తెలుగుతల్లి విగ్రహం వద్ద పవన్ లాంగ్ మార్చ్‌ను ప్రారంభించారు. భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికపైకి చేరుకున్నారు. అభిమానులకు వేదిక నుంచి పవన్ అభివాదం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.