యాప్నగరం

రాయలసీమ ఎత్తిపోతలపై జగన్ సర్కార్‌కు చుక్కెదురు.. ఎన్జీటీ కీలక ఆదేశాలు

పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సైబల్ దాసు గుప్తలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. పాత ప్రాజెక్టు అనే ఏపీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.

Samayam Telugu 29 Oct 2020, 1:09 pm
ఎన్జీటీలో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో జరిగిన విచారణలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దని.. పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సైబల్ దాసు గుప్తలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. పాత ప్రాజెక్టు అనే ఏపీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. డీటైల్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీ.పీ.ఆర్), ప్రాజెక్టు సంబంధిత అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటీషన్ పై తీర్పు వెలువరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.