యాప్నగరం

ఏపీకి మూడు రాజధానులు: కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఏపీ రాజధాని వ్యవహారంపై స్పందించారు. మూడు రాజధానుల అంశం సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 9 Jan 2020, 5:39 pm
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలపై కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంపై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిపై స్పందించేందుకు నిరాకరించిన జైరాం.. మీడియా చిట్‌చాట్‌లో మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించారు.
Samayam Telugu jairam-ramesh


మూడు రాజధానుల అంశం సాధ్యమయ్యే పని కాదని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధానిపై సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఉన్న చోటే ఏపీ రాజధానికి అనుకూలమైన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు వేర్వేరు చోట్ల ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

Also Read: తలకాయ నరికి అక్కడ పెడతాడట.. మాజీ ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు

గతంలో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కూడా అది రుజువైందన్న జైరాం.. 1953లో కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరులో హైకోర్టు సాధ్యపడలేదని ఆయన గుర్తు చేశారు. అయితే అమరావతి రైతులు ఆందోళనలు.. రాజధాని తరలింపుపై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తరువాతే తమ అభిప్రాయం వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఉమ్మడి రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విభజన సమయంలో ఏపీ రాజధానిపై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని సూచించినట్లు ఆయన చెప్పారు. మూడు రాజధానుల అంశం సాధ్యమవతుందని తాను అనుకోవడం లేదని జైరాం అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తరువాతే తమ వైఖరి స్పష్టం చేస్తామన్నారు.

Read Also: చంద్రబాబుకి కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎంపీ.. వాటే విజన్ ** అంటూ సెటైర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.