యాప్నగరం

మరో పథకానికి వైఎస్ పేరు.. జగన్ సర్కార్ ఉత్తర్వులు

ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు మార్చారు.. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు మాజీ సీఎం వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

Samayam Telugu 6 Jul 2020, 3:26 pm
ఏపీలో మరో పథకానికి వైఎస్ పేరు పెట్టింది జగన్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా పేరు మార్చారు.. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’గా ప్రభుత్వం వ్యవహరించనుంది. రైతులకు మాజీ సీఎం వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ రైతు భరోసా కేంద్రాలను మే 30న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వీటికి శ్రీకారం చుట్టారు.
Samayam Telugu ex cm ys rajasekhara reddy name forrythu bharosa centers in andhra pradesh
మరో పథకానికి వైఎస్ పేరు.. జగన్ సర్కార్ ఉత్తర్వులు


ఏకకాలంలో 10.641 కేంద్రాలు.. సీఎం యాప్‌, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను కూడా లాంఛ్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తారు.. శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి. అంతేకాదు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు కాల్‌సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ నెంబర్ 155251.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.