యాప్నగరం

TTD పాలకమండలి.. జగన్ సర్కార్‌పై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు తమ్ముళ్ల ఉబలాటం చూడలేక స్పందించానంటున్న మాజీ సీఎస్. భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదు. ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ లేదన్న ఐవైఆర్.

Samayam Telugu 19 Sep 2019, 5:44 pm
ఏపీ ప్రభుత్వం టీటీడీ కొత్త పాలకమండలిని నియమించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 8మందికి.. తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం కల్పించింది. తమిళనాడు నుంచి నలుగురు.. కర్ణాటక నుంచి మరో ముగ్గురికి ఛాన్స్ దక్కింది. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా నలుగుర్ని నియమించారు.
Samayam Telugu krishna rao


Read Also: 'గోదావరి బోటు ప్రమాదం: ప్రయాణికులు 73 కాదు 93.. ఆ మంత్రి ఒత్తిడితోనే అనుమతి'

పాలకమండలి నియామకంపై మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు తమ్ముళ్ళు నేను పేపర్ చూడకముందే నిన్నటి నుంచి టిటిడి బోర్డు పై నా అభిప్రాయం ఏంది అని ఉబలాట పడుతున్నారు. టీటీడీ వ్యవస్థలో నిర్ణయాలు ఇఓ,చైర్మన్, ముఖ్యమంత్రి మధ్య నడుస్తాయి. బోర్డు సభ్యులు దర్శనాలకు మాత్రమే. 14 మంచి సభ్యులు ఉన్న బోర్డు మేనేజ్ చేయటమే నాకు ఆ రోజుల్లో పెద్ద సమస్య’అంటూ ఆసక్తికరంగా స్పందించారు.
‘29 సభ్యుల బోర్డును మేనేజ్ చేయటం లో ఈవో పడే బాధ వర్ణనాతీతం. ఇక భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదు. ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ లేదు. స్వామి గారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి వస్తేనే ముక్తి ఉంటుంది. ఇతర రాష్ట్రాల ప్రాతినిథ్యం ముందునుంచి ఉన్న విషయమే. తెలుగు వారికి ఉన్న సింహభాగం అట్లాగే కొనసాగుతున్నది’అని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదే పద్దతి కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.