యాప్నగరం

'పవన్, బీజేపీలు ఆ పనిచేస్తే బెటర్.. లేకపోతే టీడీపీలా'

టీడీపీ జాకీలు పెట్టి లేపినా స్పందన లేదు.. బీజేపీ-జనసేన ఈ విషయాన్ని గమనించి తమ ఎదుగుదలకు ఇంకేదైనా ఎజెండా ఎంచుకుని ముందుకుపోతే మంచిదని ఐవైఆర్ సలహా.

Samayam Telugu 12 Feb 2020, 10:50 am
జనసేన-బీజేపీలను హెచ్చరించారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. టీడీపీలా కాకుండా ఆ రెండు పార్టీలు తమ రూటు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.. లేకపోతే రాజకీయంగా భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. ఐవైఆర్ ఓ ఉదాహరణను చెప్పుకొచ్చారు.
Samayam Telugu bjp.


ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన వారంలోనే దావానలంలాగా రాష్ట్రం అంతా వ్యాపించింది అన్నారు మాజీ సీఎస్. రాజధాని తరలింపు ఉద్యమానికి మీడియాలో ఒక భాగం, టీడీపీ జాకీలు పెట్టి లేపినా ప్రజా స్పందన కరువైందని చెప్పుకొచ్చారు. బీజేపీ జనసేన కూటమి ఈ విషయాన్ని గ్రహించి తమ ఎదుగుదలకు ఇంకేదైనా అజెండా ఎంచుకుని ముందుకు పోతే మంచిదని సలహా ఇచ్చారు. అమరావతిలో గత 55 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మీడియా హైప్ తప్ప అక్కడ ఏమీ లేదని ఐవైఆర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.
జనసేన-బీజేపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రెండు పార్టీలు భవిష్యత్‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపి.. రైతుల తరపున పోరాటం చేయాలని తీర్మానించాయి. ఇరు పార్టీల నేతలు కొద్ది రోజుల క్రితమే అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాన్ కూడా ఈ నెల 15న అమరావతి వెళుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.