యాప్నగరం

వైఎస్ చనిపోయాక ఆ 24 గంటలు జగన్ కోల్‌కతా హోటల్‌లో.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని ప్రచారం చేసి.. చివరకు అదే రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఇచ్చింది తెలియదు అనుకున్నావా అంటూ మాజీ మంత్రి ట్వీట్.

Samayam Telugu 25 Dec 2020, 1:58 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఘాటుగా స్పందించారు. సొంత తండ్రి చనిపోతే 24 గంటల పాటు జగన్ రెడ్డి కలకత్తా హోటల్‌లో ఏమి చేసారో తెలియదు అనుకున్నావా.. తండ్రి శవం పక్కన దొరక్కముందే సంతకాల సేకరణ ఎందుకు చేసారో తెలియదు అనుకున్నావా.. తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపేశారని ప్రచారం చేసి.. చివరకు అదే రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఇచ్చింది తెలియదు అనుకున్నావా అంటూ ప్రశ్నించారు.
Samayam Telugu సీఎం జగన్


ఇందులో బ్రోకరేజ్ ఏంటో కూడా తెలుసు 'ఏ2' అలియాస్ 'కేటు' అంటూ అయ్యన్న నిప్పులు చెరిగారు. బాబాయ్ ఎలా పోయాడో తెలియదు.. సొంత మామ ఎలా పోయాడో తెలియదు.. చివరకు తండ్రి మరణం వెనుక కూడా 'మీ' హస్తం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి అంటే.. 'మీరు' ఎంత రాక్షస జాతో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 'నువ్వు కూడా హత్యలు గురించి మాట్లాడే వాడివే. రంగా హత్యలో, మీ మహా మేత పాత్ర ఏమిటో విజయవాడ మొత్తం తెలుసు.ఎక్కువ లాగమాక, తెగుద్ది' అని విజయసాయిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే వెలగపూడిపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ము ఉంటే నిరూపించు సాయిరెడ్డి అన్నారు.
విశాఖలో భూముల కబ్జాలపై టీడీపీ-వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి-టీడీపీ ఎమ్మెల్చే వెలగపూడి మధ్య వార్ నడిచింది. ఈ క్రమంలో వెలగపూడిపై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్యకేసులో నిందితుడని.. విశాఖ పారిపోయి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనికి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.