యాప్నగరం

జగన్‌ది రాక్షస పాలన.. మాజీ మంత్రి భూమా ఘాటు విమర్శలు

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. హత్యలు, రౌడీయిజం., దౌర్జన్యాలతో వంద రోజుల పాలన సాగిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Samayam Telugu 8 Sep 2019, 4:54 pm
ప్రతీకారం, కక్షసాధింపుల కోసమే అధికారంలోకి వచ్చినట్లుందని మాజీ మంత్రి భూమా అభిలప్రియ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ వంద రోజుల పాలన హత్యలు, దౌర్జన్యాలతో సాగిందని ఘాటు విమర్శలు చేశారు. రాక్షసులే రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. గుంటూరులోని టీడీపీ పునరావాస శిబిరంలో తలదాచుకున్న బాధితులను అఖిల ప్రియ పరామర్శించారు.
Samayam Telugu Jagan desk new


Must Read : కదలిరండి తమ్ముళ్లూ.. ఛలో పల్నాడుకు చంద్రబాబు పిలుపు

పల్నాడు గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, టీడీపీ కార్యకర్తలు ఊళ్లోకి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యులు చనిపోయినా గ్రామాలకు వెళ్లలేకపోతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. వైఎస్సార్సీపీ శ్రేణులు పద్దతి మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.