యాప్నగరం

బాబు, లోకేష్‌లను జైలుకు పంపడమే ఆయన లక్ష్యం.. దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారు.. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు, లోకేష్‌లతో పాటూ టీడీపీ నేతలకు భద్రతను తగ్గించారు. ప్రజలే నేతల్ని రక్షించుకుంటారన్న దేవినేని ఉమా.

Samayam Telugu 19 Feb 2020, 11:54 am
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌లను జైలుకు పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దీని కోసం కుట్రలు చేస్తున్నారని.. అందుకే బాబు, లోకేష్‌లతో పాటూ ఇతర ముఖ్య నేతలకు భద్రతను తగ్గించారని ఆరోపించారు. టీడీపీ నేతల్ని చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తమను ప్రజలే రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu uma


జగన్ తన పాదయాత్రలో ముద్దులు పెట్టి.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని ఉమా మండిపడ్డారు. అప్పుడు ముద్దులు.. ఇప్పుడు రద్దులు మొదలు పెట్టారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు పేరు కనిపించకూడదు, వినిపించకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లలను రద్దు చేశారని.. అమరావతిని ఆపేశారని, పోలవరాన్ని పడుకోబెట్టారని మండిపడ్డారు.

పింఛన్లు ఎత్తేశారని.. ఆ బాధతో వృద్ధులు చనిపోయారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల మంది రేషన్‌కార్డులు తొలగించారని.. అలాగే టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే.. జగన్ సర్కార్ కోట్లు గడిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ తీరుతో సామాన్యులు కష్టాలుపడుతున్నారని.. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. ఈ జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర మొదలు పెట్టారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.