యాప్నగరం

కేరళలో 9 రకాల నిత్యావసరాలు.. మీరేమో ముక్కిన శనగలా: మాజీ మంత్రి ఫైర్

‘75 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రి 9 రకాల నిత్యావసరాలను ఇళ్లకు పంపారు. రేషన్ షాపుల్లో మీరిచ్చే బియ్యం శనగలు ప్రజాప్రతినిధుల ఇళ్ళల్లో వండించండి తినేటట్లు ఉన్నాయా’ అంటూ ప్రశ్న.

Samayam Telugu 18 May 2020, 1:07 pm
జగన్ సర్కార్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులు నాణ్యత లేవని.. అవి కనీసం తినగలిగే పరిస్థితి లేదన్నారు. కేరళ ప్రభుత్వాన్ని చూసి ఏపీ సర్కార్ నేర్చుకోవాలని హితవు పలికారు. అలాగే వలస కూలీల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని.. ఆదుకోవాల్సిన చోట లాఠీలు విరుగుతున్నాయని మండిపడ్డారు.
Samayam Telugu రేషన్ పంపిణీ


‘75 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రి 9 రకాల నిత్యావసరాలను ఇళ్లకు పంపారు. రేషన్ షాపుల్లో మీరిచ్చే బియ్యం శనగలు ప్రజాప్రతినిధుల ఇళ్ళల్లో వండించండి తినేటట్లు ఉన్నాయా’అని ఉమా ప్రశ్నించారు. సాములోరు చెప్పారని ముక్కిపోయిన శనగలు ఇస్తారా.. ప్రజలు కందిపప్పు సరుకులు అడుగుతున్నారు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అంటూ ట్వీట్ చేశారు.
ఉన్నత న్యాయస్థానం తీర్పులను లెక్కపెట్టకుండా వలసకార్మికులను మళ్లీ కొట్టారని ఆరోపించారు ఉమా. అన్నం మంచినీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన చోట లాఠీలు విరుగుతున్నాయి తలలు పగులుతున్నాయన్నారు. సొంతూళ్లకు పంపించమంటున్న వలసకూలీలపై మీ ప్రతాపమా.. ఇది ఆటవికరాజ్యమా, ప్రజాస్వామ్యమా సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అంటూ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.