యాప్నగరం

విశాఖ: టీడీపీకి మరో విషాదం.. గంటా ప్రధాన అనుచరుడు నలంద కిషోర్ మృతి

సోషల్ మీడియా పోస్టుల విషయంలో నెల క్రితం ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీ నేతలు కూడా ఆయన అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి గంటా మండిపడ్డారు.

Samayam Telugu 25 Jul 2020, 10:52 am
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్‌ చనిపోయారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.. అక్కడ తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో నెల క్రితం ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. టీడీపీ నేతలు కూడా ఆయన అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి గంటా మండిపడ్డారు.
Samayam Telugu నలంద కిషోర్


విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారణ జరిపారు. తర్వాత ఆయనకు బెయిల్ రావడంతో విడుదల చేశారు. అంతేకాదు ఇదే వ్యవహారంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని కిషోర్‌తో పాటూ కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ అర్థరాత్రి సమయంలో అతడ్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కూడా కర్నూలకు తరలించి.. బెయిల్ రావడంతో వదిలేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.