యాప్నగరం

బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో శూన్యం.. కేసీఆర్ అలా భావిస్తే అందులో తప్పేమీ లేదు: కొడాలి నాని

Kodali Nani గుంటూరు తొక్కిసలాట ఘటనపై స్పందించారు. చంద్రబాబు యమరథంతో ప్రజల్ని చంపుతున్నారని.. శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాది చివరిలో 8మందిని బలి తీసుకున్నారని.. ఇప్పుడు మరో ముగ్గురు బలయ్యారన్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. తాము అంశాలవారీగా జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామని.. తాము సింగిల్‌గానే పోటీ చేస్తామన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Jan 2023, 1:58 pm

ప్రధానాంశాలు:

  • గుంటూరు ఘటనపై కొడాలి నాని కామెంట్స్
  • చంద్రబాబు యమరథంతో జనాలు బలి
  • ఆయన సభలకు అనుమతి ఇవ్వొద్దన్న నాని
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kodali Nani On Guntur Stampede
ఏపీలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రభావం ఉండదని.. శూన్యం అంటూ జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani). బీఆర్ఎస్ వల్లే నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని.. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసని.. స్వయంగా ఆయనకు గెలవడం కల అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సింగల్‌గానే పోటీ చేస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీగా వ్యాఖ్యానించారు. అంశాల వారీగానే జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామే తప్ప.. ఎవరితో పొత్తు ఉండదన్నారు.
చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపుతున్నారని.. ఏడాది చివర్లో ఎనిమిది మందిని.. ఇప్పుడు ఏడాది ప్రారంభంలో మరో ముగ్గురిని బలిగొన్న నరరూప రాక్షసుడు అంటూ మండిపడ్డారు. శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహం చంద్రబాబని.. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారన్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని తాను డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

మొదలు ,చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వాళ్ళు ఎవరు వెళ్లరన్నారు. తమ నేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారన్నారు. నూటికి నూరు శాతం చంద్రబాబు పిచ్చి తోనే మరణాలు జరిగాయన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.