యాప్నగరం

మంత్రిపై హత్యాయత్నం కేసు.! స్టేషన్‌కి వచ్చేది లేదన్న ఆ మాజీ మంత్రి

తనకు సంబంధం లేకపోయినా హత్యాయత్నం కేసులో విచారణకు మాజీ మంత్రి నిరాకరించారు. నోటీసులు ఇవ్వకుండా స్టేషన్‌కి రమ్మంటే వచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 4 Dec 2020, 12:30 pm
ఏపీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై హత్యాయత్నం కేసులో విచారణకు ఆయన రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరాకరించారు. తనకు సంబంధం లేని కేసులో తనను విచారణకు రమ్మని పిలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధం లేకపోయినా సెక్షన్ 91 నోటీసులకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చానని.. మరోమారు విచారణకు రావాలంటే ఎలా వస్తానని ఆయన ప్రశ్నించారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని.. ప్రధాన రాజకీయ పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా ఉన్న తనను సాధారణ వ్యక్తిలా స్టేషన్‌కి రమ్మంటే వచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. నోటీసులు ఇస్తే విచారణకు వస్తాననడంతో అప్పటికప్పుడు ఇనగుదురు సీఐ మాజీ మంత్రికి నోటీసులు అందజేశారు.
Samayam Telugu మంత్రి నాని.. హత్యాయత్నం చేసిన దుండగుడు
perni nani


అయితే రవీంద్ర ఇంటికి పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు రవీంద్ర ఇంటికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు. విచారణకు తప్పకుండా సహకరిస్తామని.. కానీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని స్టేషన్‌కి పిలిచి విచారణ జరుపుతామనడం సరికాదని అన్నారు. కావాలంటే ఇంటి వద్దే విచారణ చేయాలని.. పూర్తిగా సహకరిస్తామని పోలీసులకు సూచించారు. దీంతో కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read:
మంత్రి నానిపై హత్యాయత్నం కేసు.. మాజీ మంత్రి ఇంటికి పోలీసులు‌!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.