యాప్నగరం

తూ.గో: వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి కన్నుమూత

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్‌సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Samayam Telugu 30 Jul 2020, 9:40 am
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొప్పన వైఎస్సార్‌సీపీకి సేవలందించారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటుగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
Samayam Telugu మాజీ మంత్రి కొప్పన మోహనరావు


కొప్పన మోహనరావు పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1978,1989) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.