యాప్నగరం

KCR కు జగన్ రిటర్న్ గిఫ్ట్.. అందుకే ఇదంతా: మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Cm Jagan కేసీఆర్‌లు ఒక్కటే అన్న మాజీ మంత్రి. జగన్ పెద్దన్నకు ,పెద్దన్న జగన్‌కు పరస్పర సహకారం కొత్తేమి కాదని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారన్నారు. జగన్ గుంట నక్క వేషాలు ప్రజలు గమనిస్తున్నారని.. ఏపీలో ఓట్లను చీల్చడానికి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సరే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇది ఏపీకి చాలా అవసరం అని వ్యాఖ్యానించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 18 Jan 2023, 7:54 am

ప్రధానాంశాలు:

  • ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల స్నేహం
  • బాబు సీఎం కావడం ఏపీకి చాలా అవసరం
  • ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు ఖాయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ys Jagan Kcr
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేరు కాదు అన్నారు మాజీ మంత్రి జవహర్. బీఆర్ఎస్ సభకు ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున బస్‌లు పంపుతున్నారని.. వ్యతిరేక ఓటు చీల్చటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్ర నుంచి బస్‌లను కేటాయించటంలో అర్దం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పెద్దన్నకు ,పెద్దన్న జగన్‌కు పరస్పర సహకారం కొత్తేమి కాదు అన్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు సహకరించినందుకు ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారన్నారు జవహర్. జగన్ గుంట నక్క వేషాలు ప్రజలు గమనిస్తున్నారని.. ఎవరు ఎన్ని చేసినా టీడీపీ గెలుపును ఆపలేరన్నారు.. అధికారంలోకి రావడం ఖాయమని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్‌కు చాలా అవసరం అన్నారు మాజీ మంత్రి.

మరోవైపు తెలుగు దేశం పార్టీ లో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర సందడి మొదలైంది. పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలు లోకేష్ ను కలిసి పాదయాత్రకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో లోకేష్ ను పలువురు టీడీపీ సీనియర్ నేతలు కలిశారు. కుప్పం నుంచి ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రపై నేతలు చర్చించారు.

నేతలు యువగళం యాత్రకు తమ మద్దతు తెలిపారు. ఈ రోజు కలిసిన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ తదితరులు ఉన్నారు. తన పాదయాత్ర వివరాలను లోకేష్ వారిలో పంచుకున్నారు. మద్దతు తెలిపిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల మద్దతు, సహకారంతో.. ప్రజల్లో చైతన్యం తెచ్చేవిధంగా యువగళం పాదయాత్ర నిర్వహిస్తానని లోకేష్ వారికి తెలిపారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.