యాప్నగరం

'మహిళపై వైసీపీ నేత అత్యాచారయత్నం'.. లోకేష్ సంచలన ఆరోపణలు

అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నిస్తూ ఓ వీడియోను ట్వీట్ చేసిన మాజీ మంత్రి.

Samayam Telugu 28 Oct 2019, 1:35 pm
ట్విట్టర్‌లో బాగా యాక్టివ్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పోలవరం, పీపీఏలు, ఇసుక కొరత, రాజధాని.. ఇలా అన్ని అంశాలపై ట్వీట్ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారని.. ఓ వీడియోను ట్వీట్ చేశారు.
Samayam Telugu lokesh


Read Also: వంశీ రాజీనామాతో వైసీపీ గేమ్ ప్లాన్.. అదే జరిగితే బాబు ఇరుకునపడతారా!

లోకేష్ బాధితురాలి వీడియో ట్వీట్ చేసి.. ‘అనంతపురం జిల్లా ఈదులబలపురంలో ఒక మహిళ భర్తను బంధించి, మీ నాయకుడొకరు ఆమెపై అత్యాచారం చేయబోయిన ఘటన అత్యంత ఘోరం. ఈ అభాగ్యురాలు చేసిన పాపమేంటి? ఎన్నికలప్పుడు అమ్మా, అక్కా, చెల్లీ అని ఓట్లు అడిగారు కదా జగన్ గారూ, ఇప్పుడు వాళ్ళకి భద్రత కరువయ్యింది, దీనికేం సమాధానం చెప్తారు?’అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.
మరి లోకేష్ చేస్తున్న ఈ ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. మాజీ మంత్రికి ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.