యాప్నగరం

'అలా జరిగితే బాధగా ఉండదా జగన్ గారూ'

'అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని మెదడు అరికాల్లో ఉన్న మంత్రులు ఇచ్చే పిచ్చి స్టేట్ మెంట్లు విన్నవారు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా ముందుకు వస్తారు'

Samayam Telugu 13 Nov 2019, 9:02 am
ఏపీ రాజధాని అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం-సింగపూర్ కన్సార్టియం చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో.. ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల.. సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి ఈశ్వరన్ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu jagan.


సింగపూర్ సర్కార్ నిర్ణయం, తాజా పరిణామాలపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. అమరావతిని మరుగున పడేస్తున్నారని మండిపడ్డారు. ‘జగన్ గారిది మిషన్ బిల్డ్ ఏపీ కాదు మిషన్ ఎండ్ ఏపీ అన్న విషయం సింగపూర్ ప్రభుత్వానికి అర్థమయ్యింది. అమరావతి అభివృద్ధికి ఎంతగానో సహకరించిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ ని రద్దుచేసుకోవడం చేతగాని ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం’అన్నారు.
‘అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు అని మెదడు అరికాల్లో ఉన్న మంత్రులు ఇచ్చే పిచ్చి స్టేట్ మెంట్లు విన్నవారు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా ముందుకు వస్తారు? మొన్నటి వరకూ ఎక్కడ చూసినా మార్మోగిన అమరావతి జగన్ గారి పాలనలో మరుగున పడిపోతుంటే బాధగా ఉంది’అన్నారు లోకేష్.
రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో రాజధాని అమరావతిలో 6.84 చ.కి.మీ అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తాజాగా జగన్ సర్కార్ స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.