యాప్నగరం

సీఎం జగన్ ఇంటి ఫోటోలు ట్వీట్ చేసిన లోకేష్

సీఎం జగన్ ఇంటి ఫోటోలు ట్వీట్ చేసిన లోకేష్. వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి.. లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయి అంటూ ఫైర్.

Samayam Telugu 25 Feb 2020, 7:28 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో బాగా యాక్టివ్ అయ్యారు. ప్రజా సమస్యలతో పాటూ ప్రభుత్వంపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను లోకేష్ తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల స్థలాలు లాక్కొంటున్నారని మండిపడ్డారు.
Samayam Telugu lokesh


లోకేష్ తన ట్వీట్‌లో.. పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం జగన్ గారి రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట. పథకాల పేరు మార్పు కోసం, పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న, భూములు ఎందుకు లాక్కుంటున్నారు అని మండిపడ్డారు. వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి.. లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయి అన్నారు. ట్వీట్‌తో పాటూ సీఎం జగన్ ఇంటి ఫోటోలను కూడా జతపరిచారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున 25లక్షలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్థలాలను సేకరించే పనిలో ఉంది. కలెక్టర్‌లు, అధికారులు స్థలాలను గుర్తించి పట్టాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో స్థలాల విషయంలో వివాదం రేగింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.