యాప్నగరం

‘అమరావతికి నిధులొద్దని ప్రధానికి జగన్ చెప్పారు..’

రాజధాని అమరావతి నిర్మాణం ప్రభుత్వానికి ఇష్టం లేదు. అమరావతికి ఇప్పుడే నిధులు ఇవ్వక్కర్లేదని ప్రధానికి వైఎస్ జగన్ చెప్పి వచ్చారని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

Samayam Telugu 12 Sep 2019, 1:52 pm
రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల్లేవంటూ ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన సింగపూర్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. జగన్ సర్కార్‌కి అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదని, బుగ్గన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధానిపై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్జేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Samayam Telugu Amaravati-2_3078


Must Read : మంత్రి బుగ్గన గారూ.. విదేశాల్లో ఏపీ పరువు తీస్తారా!

తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని బుగ్గన చెప్పడం దారుణమన్నారు. అది కూడా భారత్ సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సు వేదికగా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల్లేవని చెప్పడానికి బదులు అమరావతి అంటే మాకిష్టం లేదని చెప్పాల్సిందన్నారు.

రాజధానికి నిధులు లేవని మంత్రి బుగ్గన చెప్పడం కరెక్ట్ కాదని లోకేష్ అన్నారు. ఇప్పుడే నిధులు అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి చెప్పారని ఆరోపించారు. నిధులు ఇప్పుడే ఇవ్వనక్కరలేదని జగన్ ప్రధానికి చెప్పి వచ్చిన విషయం గుర్తు లేదా అంటూ బుగ్గనను నిలదీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.