యాప్నగరం

'జగన్ గారూ మీరు చేసేవి మంచి పనులు అయితే ఆ జీవో ఎందుకు?'

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2430 జీవోపై రగడ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్. మీరు తప్పులు చేస్తుంటే, అందరూ మీ భజనలు చేయాలా అంటూ లోకేష్ ప్రశ్న.

Samayam Telugu 31 Oct 2019, 5:19 pm
జగన్ సర్కార్ 2430 జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపైపా చర్యలు తప్పవు. ఈ వార్తలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా విభాగాల (ప్రభుత్వశాఖల) కార్యదర్శులకు అప్పగించారు. కొత్త జీవో ప్రకారం.. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు న్యాయపరంగా కేసులు దాఖలు చేస్తారు.
Samayam Telugu jagan


Read Also: జైలులో చింతమనేనిని కలిసిన నారా లోకేష్.. కుటుంబానికి పరామర్శ

ఈ జీవోకు ఏపీ మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలపగా.. తాజాగా జీవోను విడుదల చేశారు. ఈ జీవోపై జర్నలిస్టు సంఘాలతో పాటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.. జగన్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. మీడియా గొంతు నొక్కుతారా అంటూ ప్రశ్నించారు.

‘జగన్ గారూ! మీరు చేసేవి మంచి పనులే అయితే జీవో2430ను ఎందుకు తెచ్చినట్టు? మీ దొంగతనాలను, అవినీతిని కప్పిపుచ్చుకోడానికి మీడియా గొంతు నొక్కుతారా? మీరు తప్పులు చేస్తుంటే, అందరూ మీ భజనలు చేయాలా? ఈ జీవోని వెంటనే రద్దు చేయండి. లేదంటే తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది’అన్నారు లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.