యాప్నగరం

'జగన్ గారూ.. మరీ ఇంత దారుణంగా దాడి చేస్తారా'

టిడిపి కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారు. తిరుచానూరులో టిడిపి కార్యకర్త హేమంత్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం చేస్తున్నాం.

Samayam Telugu 7 Nov 2019, 11:40 am
జగన్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పోలీసుల సాయంతో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని.. చిత్తూరు జిల్లాలో అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో టీడీపీ కార్యకర్తపై పోలీసులు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లకు కూడా వైఎస్సార్‌సీపీ జెండా రంగులు వేయాలంటూ చురకలంటించారు. త్వరలోనే ప్రైవేట్ కేసులు పెట్టబోతున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.
Samayam Telugu ctr.


Read Also: సీఎం జగన్ పీఏ పేరుతో కలెక్ట‌ర్‌కు బురిడీ

‘స్మశానాలకు, మరుగుదొడ్లకు మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా జగన్ గారు. ఇక ఆలస్యం ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా వైకాపా రంగులు వెయ్యడం ప్రారంభించండి. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.ఇప్పుడు టిడిపి కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారు. తిరుచానూరులో టిడిపి కార్యకర్త హేమంత్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను’అన్నారు లోకేష్.
‘ముఖ్యమంత్రి తన ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకుందామనే సరికొత్త పంధా ఎంచుకున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదు అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నాం’అని లోకేష్ చెప్పారు. మరి లోకేష్ చేసిన ట్వీట్లకు వైఎస్సార్‌సీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.