యాప్నగరం

నారావారిపల్లె వైసీపీ సభ: 'This is వాస్తవం'.. వీడియో ట్వీట్ చేసిన లోకేష్

నారావారిపల్లెలో మూడు రాజధానులకు మద్దతుగా సభ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ. సభ సక్సెస్ అంటున్న అధికార పార్టీ.. దిస్ ఈజ్ వాస్తవం అంటూ వీడియో ట్వీట్ చేసిన నారా లోకేష్.

Samayam Telugu 3 Feb 2020, 12:25 pm
మూడు రాజధానులుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో భారీ బహిరంగ సభ పెట్టింది వైఎస్సార్‌సీపీ. మంత్రులు, పార్టీ ముఖ్య నేతల్ని ఆహ్వానించి.. చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సభకు పోటీగా టీడీపీ కూడా ఆందోళనలకు పిలుపునివ్వడంతో నారావారిపల్లెలో హైటెన్షన్ కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు.
Samayam Telugu naravaripalle


సభ సంగతి అలా ఉంటే.. మూడు రాజధానులపై చంద్రబాబు ఇలాకాలో సమరభేరి మోగించి సక్సెస్ అయ్యామని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అధికార పార్టీకి అంత సీన్ లేదు.. ఆ సభకు జనమే రాలేదంటోంది టీడీపీ. సభకు జనాలే రాలేదని.. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయని చెబుతోంది. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకడుగు ముందుకు వేసి ఓ వీడియోను ట్వీట్ చేశారు.

లోకేష్ తన ట్వీట్‌లో కాస్త ఘాటుగానే వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేశారు. ‘జప్ఫాలు.. THIS is వాస్తవం’ అంటూ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన సభలో ఉన్న ఖాళీ కుర్చీలు కనిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.