యాప్నగరం

అమెరికాలో చదివా.. కానీ 40 వేల కోట్లు దొబ్బలా! టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి నారా లోకేష్. టీడీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.

Samayam Telugu 15 Nov 2019, 4:50 pm
టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరులో 125 కుటుంబాలను వెలివేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అలాగే తెలుగుదేశం నేతలు 18 మందిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతలను వెంటాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu Jagan desk new


రాజశేఖర్ రెడ్డిది ఫ్యాక్షనిజం.. జగన్‌ది సైకోయిజమని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ హయాంలో వందల మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు జగన్ సైకోయిజానికి పాల్పడుతున్నారు. రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడం.. కేసులు పెట్టి వేధించడం వంటి దుర్మార్గపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: జూనియర్ ఎన్టీఆర్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే వంశీపై తీవ్ర ఆగ్రహం

నెల్లూరు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన టీడీపీ కార్యకర్త కార్తీక్‌ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్తీక్ చావుకు కారణమైన నిందితులపై కేసులు నమోదు చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చని పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు.

ఇంగ్లిష్ మీడియం వ్యవహారంంపై నారా లోకేష్ స్పందించారు. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదివాను.. అమెరికాలో చదివాను.. కానీ 40 వేల కోట్లు దొబ్బలేదు.. 16 నెలలు జైల్లో ఉండలేదు.. కావాలి జగన్.. రావాలి జగన్ అని సీబీఐ కోర్టు పిలుస్తోంది.. ఆయనొచ్చి నీతులు చెబుతున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ1 జగన్, ఏ2 విజయసాయి నీతులు చెబుతుంటే వినాల్సి వస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే దొంగ పేపర్‌లో తప్పుడు రాతలు రాశారని ఆరోపించారు. మీడియంపై పిల్లలకు ఆప్షన్ ఇవ్వాలన్నారు.

Read Also: గుంటూరులో ఆలయం కూల్చివేత.. జగన్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన హిందూ సంఘాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.