యాప్నగరం

ఆ ఘటన నన్ను కలిచివేసింది.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్

ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది అన్నారు. రైతు కృపానందం మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది.

Samayam Telugu 8 Jan 2020, 11:10 am
అమరావతిలో మరో రైతు కన్నుమూశాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతు అద్దేపల్లి కృపానందం గుండెపోటుతో ప్రాణాలు వదిలినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైతు రాజధాని కోసం అర ఎకరం పొలం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.
Samayam Telugu lokesh.


రైతు మరణంపై మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి ట్వీట్ చేశారు.. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారని మండిపడ్డారు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది అన్నారు. కృష్ణాయపాలెంలో ఆందోళనతో రైతు కృపానందం మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు లోకేష్.
వైఎస్సార్‌సీపీ నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి అన్నారు లోకేష్. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.