యాప్నగరం

'ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ ఆ మాట చెప్పండి జగన్ గారు'

'ఏం తినేటట్లు లేదు. ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి జగన్ గారు.. మా అక్కాచెల్లెళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు'

Samayam Telugu 20 Nov 2019, 2:10 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయని.. బంగారంతో సమానంగా కూరగాయల రేట్లు పెరిగాయన్నారు. ఓ ఫోటోను ట్వీట్ చేసి జగన్ సర్కార్‌కు చురకలంటించారు. అక్కాచెల్లెమ్మలకు కంటనీరు తెప్పిస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu jagan..


‘కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి జగన్ గారు పెంచుకుంటూ పోతున్నారు అని. ఉల్లి కోయకుండానే మా అక్కాచెల్లెళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. పనులు లేకుండా చేసారు’అంటూ మండిపడ్డారు నారా లోకేష్.
‘అప్పో, సొప్పో పూట గడుపుకుందామనుకుంటే సంచి కూరగాయలు రావాలి అంటే బస్తా డబ్బులు పట్టికెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కూరగాయల ధరలు నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. 45ఏళ్లకే మహిళలకు పెన్షన్ అని మోసం చేసారు. ఇప్పుడు కనీసం కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.