యాప్నగరం

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానం.. ఇకనైనా పబ్లిసిటీ పక్కన పెట్టండి: లోకేష్

రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారు జగన్ గారు. ఇచ్చిన ప్రతీ హామీలో మోసం.. ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారు.

Samayam Telugu 2 Sep 2020, 1:10 pm
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఉచిత విద్యుత్ పథకం తీసివేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టారని ఆరోపించారు. పబ్లిసిటీ పక్కన పెట్టి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
Samayam Telugu నారా లోకేష్


రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారు జగన్ గారు. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారు.. ఆఖరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక వైఎస్సార్‌సీపీ అసమర్ధ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతీ హామీలో మోసం.. ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారని ఆరోపించారు. 15 నెలల్లో జగన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయని.. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్నారు. ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి అంటూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.