యాప్నగరం

'జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి.. ఏపీ మంత్రి స్వయంగా ప్రకటించారు': లోకేష్

'9నెలల కాలంలో ఒక్క కంపెనీ తీసుకురాలేని వాళ్లు.. అదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతోంది అనడం వారి చేతగానితనం. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకి రావాల్సిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బ తీశారు ': లోకేష్ ఫైర్

Samayam Telugu 19 Feb 2020, 12:21 pm
అదానీ కంపెనీ వ్యవహారంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీరుతోనే అదానీ వేరే రాష్ట్రానికి తరలి వెళ్లిపోయిందని టీడీపీ ఆరోపిస్తుంటే.. గత ప్రభుత్వం అదానీ కంపెనీ రూ.70వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందంటూ హంగు, ఆర్భాటం చేశారని.. ఆ ప్రచారంలో నిజం లేదని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. తాజాగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.. అదానీకి ప్రత్యామ్నాయం మరో స్థలం కేటాయిస్తామని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
Samayam Telugu cm


జగన్ గారు ఉత్తరాంధ్ర ద్రోహి అని స్వయంగా ఐటీ శాఖ మంత్రి ప్రకటించారని లోకేష్ అన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల అదానీ కంపెనీ ఏపీ నుండి వెళ్లిపోయిందని.. 9నెలల కాలంలో ఒక్క కంపెనీ తీసుకురాలేని వాళ్లు అదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతోంది అనడం వారి చేతగానితనాన్ని బయటపెట్టుకోవడమేనని విమర్శించారు.
రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు కల్పించే అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతిస్తున్నారన్నారు. ఉన్న ఉద్యోగస్తులను తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణో, యువతకి కొత్త ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి వికేంద్రీకరణో ఆలోచించాలి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.