యాప్నగరం

'జగన్ నీచ రాజకీయం.. ఆ అవినీతి అనకొండ ఇప్పుడెలా మారినట్లో'

'100 కోట్లు తీసుకోని టీటీడీ పదవి అమ్ముకున్నారని లోటస్ పాండ్ ఆర్టిస్టులు రెచ్చిపోయారు. శేఖర్ రెడ్డి అవినీతి అనకొండ అని రాశారు.. ఉన్నట్టుండి శేఖర్ రెడ్డి సచ్చీలుడు, దైవ చింతన ఉన్న వ్యక్తిగా ఎలా మారిపోయాడో జగన్ గారు'

Samayam Telugu 21 Sep 2019, 8:34 pm
టీటీడీ పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఏడుగురిలో ప్రముఖ వ్యాపారి శేఖర్‌రెడ్డి పేరు ఉండటంపై వివాదం మొదలయ్యింది. టీడీపీ హయాంలో శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించడం.. ఆ తర్వాత నోట్లు రద్దు సమయంలో భారీగా కొత్త కరెన్సీ బయటపడటంతో పదవి నుంచి తప్పించారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ టీడీపీ ప్రభుత్వంపై మండిపడింది. శేఖర్‌రెడ్డి లోకేష్‌కు రూ.100కోట్లు ఇచ్చి మరీ టీటీడీ పదవి దక్కించుకున్నారని ఆరోపించంది. టీడీపీ కూడా ప్రస్తుతం ఇవే ఆరోపణల్ని అస్త్రంగా మార్చుకుంది. జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.
Samayam Telugu jagan


Read Also: 'విజయసాయిరెడ్డికి ఓపెన్ ఛాలెంజ్.. ఆ ట్వీట్ చేసే ..

‘టీటీడీ సాక్షిగా జగన్ గారి నీచ రాజకీయం పరాకాష్టకి చేరుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నల్ల పేపర్, ఛానల్ ద్వారా శేఖర్ రెడ్డి నాకు బినామీ అని ప్రచారం చేసారు. 100 కోట్లు తీసుకోని టీటీడీ పదవి అమ్ముకున్నారని లోటస్ పాండ్ ఆర్టిస్టులు రెచ్చిపోయారు’అని గుర్తు చేశారు మాజీ మంత్రి నారా లోకేష్.
‘టీటీడీని ప్రక్షాళన చెయ్యడం అంటే, సిగ్గులేకుండా నల్ల పేపర్లో వార్తలు మార్చడం అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం. ప్రజలు తగలబెట్టక ముందే మీరే మీ నల్ల పేపర్ ని తగలబెట్టుకోవడం బెటర్ జగన్ గారు!’అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
‘అప్పుడు శేఖర్ రెడ్డి అవినీతి అనకొండ అని రాసిన మీ నల్ల పేపర్ ఈ రోజు చెన్నై ఎడిషన్ లో శేఖర్ రెడ్డిని ఆకాశానికి ఎత్తింది. ఉన్నట్టుండి శేఖర్ రెడ్డి సచ్చీలుడు, దైవ చింతన ఉన్న వ్యక్తిగా ఎలా మారిపోయాడో జగన్ గారు చెప్పాలి’ అన్నారు.
‘36 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేసిన మీకు, స్థానికత, రిజర్వేషన్లు గుర్తురాలేదా? 75 శాతం స్థానికత, 50 శాతం రిజర్వేషన్లు కేవలం కలరింగ్ మాత్రమే అని టీటీడీ బోర్డు ఏర్పాటుతో తేలిపోయింది. అసెంబ్లీలో బిల్లు పెట్టేప్పుడు గుర్తున్న బీసీలు పదవుల కేటాయింపుల్లో ఎందుకు గుర్తుండటం లేదు?’అని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.