వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్ల దాడిని పెంచారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్. రోజుకో అంశంతో జగన్తో పాటూ కొత్త సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మీసేవ ఉద్యోగుల సమస్యలపై లోకేష్ స్పందించారు. అందరికీ సమన్యాయం చేస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. ‘అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాగుతుంది. వైఎస్ జగన్ గారిని చూస్తుంటే ఇది నిజం అని తేలిపోయింది. అందరికీ సమన్యాయం చేస్తా అంటే ఏంటో అనుకున్నాం’అంటూ ట్వీట్ చేస్తూ జగన్ను ఎద్దేవా చేశారు నారా లోకేష్ .
‘మొన్న ఆశా కార్యకర్తలు, నిన్న గోపాల మిత్రలు, ఈరోజు జూడాలు ఇక మీరిప్పుడు మీసేవ కూడా రద్దు చేస్తే రేపు మీసేవ ఉద్యోగులన్న మాట. అందరినీ రోడ్ల పాలు చేస్తున్నారు. ఓటేసిన ఏ ఒక్కరినీ వదలడం లేదు. మీ ఉద్దేశ్యంలో మాట తప్పం అంటే ఇదేనా?’అంటూ చురకలటించారు మాజీ మంత్రి.
'ఓహో.. జగన్ చేస్తానన్న సమన్యాయం ఇదా'
'మీకు ఓటేసిన ఏ ఒక్కర్నీ వదలడం లేదుగా.. ఓహో మీ ఉద్దేశ్యంలో చేస్తానన్న సమన్యాయం.. మాట తప్పం అంటే ఇదేనా' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేసిన నారా లోకేష్.
Samayam Telugu 10 Aug 2019, 3:21 pm
ప్రధానాంశాలు:
- ట్విట్టర్లో వైసీపీని టార్గెట్ చేస్తున్న నారా లోకేష్
- మీసేవ ఉద్యోగుల సమస్యలపై లోకేష్ ట్వీట్
- వరుసగా ఒక్కొక్కర్ని ఇలా రోడ్డు పాలు చేస్తున్నారా