యాప్నగరం

'జగన్ ఫ్లెక్సీని చించేసిన వైసీపీ కార్యకర్త.. ఓటేసి తప్పు చేశానంటూ'

ముఖ్యమంత్రి జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోను చించేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త. ఓటు వేసి తప్పు చేశానంటూ ఆవేదన.. వీడియో వైరల్. ట్వీట్ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్.

Samayam Telugu 12 Feb 2020, 1:15 pm
ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్త సొంత పార్టీపై విరుచుకుపడ్డాడు. ఓటు వేసి తప్పు చేశానంటూ అభిమానంతో పెట్టిన సీఎం జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీని చించేశాడు. ఇక జన్మలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వనంటూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. తాను రోడ్డు ప్రమాదంలో గాయపడి కష్టాల్లో ఉంటే ఒక్కరూ ఆదుకోలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
Samayam Telugu ong.


ఈ వీడియోను మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేల్చారు. సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోని జగన్ గారు మూడు రాజధానులు నిర్మిస్తా అనడం విచిత్రంగా ఉంది అన్నారు లోకేష్. ఆయన మాటలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే నమ్మే పరిస్థితి లేదన్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం పనిచేశాడట. ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడట. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి అతడి కాలికి తీవ్ర గాయమయ్యింది. ఇంత జరిగినా పార్టీకి సంబంధించిన ఎవరూ తనను పట్టించుకోలేదని.. పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు ఇచ్చే గౌవరం ఇదా అంటూ మండిపడ్డాడు.

పార్టీపై కోపంతో ఆ యువకుడు తన అభిమాన నేత, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. సీఎం జగన్ ఫోటోలతో పెట్టిన ఫ్లెక్సీని చించేశాడు. తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పుకుంటూ ఓ వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఈ వీడియోనే నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.