యాప్నగరం

YSRCP ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోనే ఉన్నారు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

AP Mlc Elections ఆసక్తికరంగా మారాయి. చివరి నిమిషంలో అభ్యర్థిని నిలబెట్టిన టీడీపీ. విజయంపై ధీమాతో ఉన్న టీడీపీ. 23మంది కచ్చితంగా ఓటు వేస్తారని ధీమాతో ఉన్న ప్రతిపక్ష పార్టీ. అలాగే అధికార పార్టీ నుంచి కొందరు తమకు టచ్‌లో ఉన్నారంటూ మాజీ మంత్రి బాంబ్ పేల్చారు. 23మందిలో తమకు నలుగురు మద్దతు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదంటున్నారు. అసెంబ్లీలో ప్రధానంగా 17 అంశాలపై ప్రస్తావిస్తామంటున్న టీడీపీ.. ఈసారైనా అధికారపక్షం పద్దతి మార్చుకోవాలన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 14 Mar 2023, 12:13 pm

ప్రధానాంశాలు:

  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
  • తాము గెలుస్తామని టీడీపీ నేతల్లో ధీమా
  • వైసీపీ నుంచి టచ్‌లో ఉన్నారని లీకులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chinarajappa On Mlc Elections
ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పెంచాయి. మొత్తం ఏడు స్థానాలు ఏకగ్రీమవుతాయని వైఎస్సార్‌సీపీ భావిస్తే.. అనూహ్యంగా టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) బరిలోకి దిగారు. అయితే టీడీపీ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు. మాజీ మంత్రి చినరాజప్ప ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైఎస్సార్‌సీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపు ఖాయమన్నారు నిమ్మకాయల చినరాజప్ప. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉందని.. పార్టీకి దూరంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు గెలిచింది టీడీపీ గుర్తుపై కాబట్టి.. తమ అభ్యర్థికి ఓటేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒక వేళ ఆ నలుగురు తమకు ఓటేయకుంటే వైఎస్సార్‌సీపీ నుంచి అంతకంటే ఎక్కువ మందే తమకు ఓటేస్తారని చెప్పుకొచ్చారు. చాలా మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. అసెంబ్లీ పెట్టాలంటేనే జగన్ భయపడుతున్నారని.. సభలో 15కు పైగా ప్రజా సమస్యలు లెవనెత్తేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చివరి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.

పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఉన్నారని.. ఇందుకు ప్రజా స్వామ్యవాదులంతా ఏకం కావాలని పిలుపునిస్తున్నాము అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ అభ్యర్థిని పోటీలో పెట్టామని.. రాజకీయాల్లో పొత్తులనేది సర్వసాధారణమన్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల మీదే పోరాడుతున్నారని.. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై చర్చించి ప్రకటన చేస్తారన్నారు.

టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి బీసీ మహిళను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి నిలిపామన్నారు అచ్చెన్న. తెలుగుదేశానికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారని సాక్షాత్తూ స్పీకర్ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారని.. సైకిల్ గుర్తుపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలవడం ఖాయమన్నారు.

చివరి బడ్జెట్ సమావేశాల్లో అయినా అధికార పక్షంలో మార్పు వచ్చి సజావుగా చర్చ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ప్రధానంగా రాష్ట్రంలో 17 సమస్యలపై ప్రజలు బాధపడుతున్నారు వీటిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, స్పీకర్ తీరు మారి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండాలన్నారు. కనీసం ప్రతిపక్షాలు శాసనసభలో ఉన్నారని గుర్తించరని, మాట్లాడనివ్వరని, మైక్ ఇవ్వరన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.