యాప్నగరం

జగన్ సర్కార్ ఇవ్వాల్సింది రూ.22వేల కోట్లు.. మాజీ మంత్రి పరిటాల సునీత

సున్నా వడ్డీ పథకం టీడీపీ హయాంలో కూడా అమలు చేశామని.. డ్వాక్రా మహిళలకు రూ.2600కోట్లు చెల్లించామన్నారు పరిటాల సునీత. ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉంటే తర్వాతి ప్రభుత్వాలు చెల్లిస్తాయని.. ఇది ఎప్పుడూ జరిగేదే అని చెప్పుకొచ్చారు.

Samayam Telugu 25 Apr 2020, 7:16 am
జగన్ సర్కార్ డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సింది రూ.22వేలు అన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. రూ.1400కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం చాలా పాతదని.. 2012లోనే కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని అమలు చేసింది అన్నారు. కానీ ఈ పథకం ఇప్పుడే ప్రారంభమైనట్లు వైఎస్సార్‌సీపీ అబద్ధపు ప్రచారం చేసుకొంటోందని విమర్శించారు.
Samayam Telugu జగన్ (File Photo)


సున్నా వడ్డీ పథకం టీడీపీ హయాంలో కూడా అమలు చేశామని.. డ్వాక్రా మహిళలకు రూ.2600కోట్లు చెల్లించామన్నారు. ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉంటే తర్వాతి ప్రభుత్వాలు చెల్లిస్తాయని.. ఇది ఎప్పుడూ జరిగేదే అని చెప్పుకొచ్చారు. సున్నా వడ్డీకి అదనంగా టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకమ పేరుతో డ్వాక్రా మహిళలకు రూ.18,500 కోట్లు అందచేసిందని.. ఈ రెండూ కలిపితే గత ఐదేళ్లలో డ్వాక్రా మహిళలు రూ.21వేల కోట్లు పొందారు అన్నారు.

ఎన్నికల వాగ్దానం ప్రకారం జగన్‌ డ్వాక్రా మహిళలకు తొలి ఏడాదిలో రూ.22వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే పదో వంతు కూడా ఇవ్వలేకపోయిందని పరిటాల సునీత ఆరోపించారు. ఒక్క అవకాశమివ్వాలని కాళ్లావేళ్లా పడి.. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. వెంటనే ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.