యాప్నగరం

జగన్ సొంత జిల్లాలో వైసీపీ సీనియర్ నేత పార్టీ మారతారని ప్రచారం.. ఆయన ఏమన్నారంటే!

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గతంలో టీడీపీలో కొనసాగారు.. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే కొద్దిరోజులుగా ఆయనకు వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య గ్యాప్ వచ్చిందని.. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది.

Samayam Telugu 7 Nov 2020, 10:37 am
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పార్టీ మారతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆయనకు తెలియడంతో స్పందించారు.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారతున్నట్లు వస్తున్న వదంతులను మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కొట్టిపారేశారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరాను అన్నారు. తనకు వేరే ఆలోచన లేనే లేదని.. తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్సార్సీపీని బలపరుస్తాను అన్నారు.
Samayam Telugu వైసీపీ


తాను వైఎస్సార్‌సీపీలోకి రాకముందు వైఎస్సార్‌సీపీ కోసం ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారన్నారు సుబ్బారెడ్డి.
తాము కొత్తగా వచ్చామని.. సర్దుబాటుకు సమయం పడుతుంది అన్నారు. అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని.. వైస్సార్‌సీపీపై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డితో సహా పార్టీలో అందరూ తమను గౌరవిస్తున్నారన్నారు.
పార్టీ మారే అవసరం లేదు.. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటాను అన్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గతంలో టీడీపీలో కొనసాగారు.. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే కొద్దిరోజులుగా ఆయనకు వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య గ్యాప్ వచ్చిందని.. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్పందించారు.. పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.