యాప్నగరం

టీడీపీకి చెందిన కాపు నేత బీజేపీలోకి.. చక్రం తిప్పిన కన్నా!

కాపు సామాజిక వర్గాన్ని మొత్తం బీజేపీ వైపు మళ్లించేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఆ బాధ్యతలను కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే శనక్కాయల అరుణ బీజేపీలోకి వెళ్లారని టాక్.

Samayam Telugu 3 Oct 2019, 12:48 pm
టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన డాక్టర్ శనక్కాయల అరుణ బీజేపీలో చేరారు. అనుచరులతో కలిసి ఆమె కమలం గూటికి చేరారు. కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో రామ్ మాధవ్ సమక్షంలో వీరంతా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అరుణ బీజేపీలో చేరేలా కన్నా చొరవ తీసుకున్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీని బలోపేతం చేయడం కోసం.. తన సామాజిక వర్గం వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు.
Samayam Telugu kanna2


గతంలో కాపు సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉండేది. ఏపీ విభజన తర్వాత మెజారిటీ కాపు నేతలు తెలుగుదేశం కండువా కప్పుకొన్నారు. ప్రస్తుతం కాపు నేతలు ఏ ఒక్క పార్టీకీ మద్దతు పలకడం లేదు. కొందరు టీడీపీలోనే ఉండిపోగా.. మరికొందరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కొందరు అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీలో ఉన్నారు.

Read Also: గ్రామ సచివాలయ ఉద్యోగాలు.. అభ్యర్థులకు షాకిస్తోన్న ప్రభుత్వ నిబంధనలు

కాపులందర్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపియిస్తున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించాలనే వ్యూహంతోనే బీజేపీ.. కన్నాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. మరికొందరు కాపు నేతలు అరుణ బాటలో పయనిస్తే.. టీడీపీకి భారీ దెబ్బ తగిలినట్టే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.