యాప్నగరం

'ఇసుక మాఫియాలో ఏపీ మంత్రులకు వాటాలు'

రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కుతున్నారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోదా. వైఎస్సార్‌సీపీ కేడర్ కోసమే ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లుంది.

Samayam Telugu 9 Oct 2019, 3:42 pm
ఏపీలో ఇసుక కొరతపై రగడ కొనసాగుతోంది. కొత్త పాలసీతో ఇసుక అందుబాటులోకి తెచ్చామని జగన్ సర్కార్ చెబుతుంటే.. ఇప్పటికీ కొరతతో భవన నిర్మాణ కార్మికులు కష్టాలు పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక రేటు ఆకాశాన్ని తాకుతోందని.. రోజువారీ కూలీల కష్టాలు పట్టవా అంటూ ప్రశ్నిస్తోంది. తాజాగా మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu sujay


వైసీపీ కేడర్ కోసమే ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చిందన్నారు సుజయ్. ఇసుక మాఫియాతో మంత్రులు చేతులు కలిపారని.. వారికి వాటాలు అందుతున్నాయన్నారు. ప్రజల కష్టాల్ని పట్టించుకోకుండా జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. సామాన్యులపై ఇసుక భారం మోపి భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కేలా చేశారన్నారు. స్టాక్ పాయింట్లలో అవసరమైనంత ఇసుకను ఉంచలేకపోతున్నారని.. ప్రభుత్వం చెబుతున్న ఖర్చుకు ఇసుకను రవాణా చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

జగన్ సర్కార్ అమలు చేస్తున్నామని చెబుతున్న కొత్త ఇసుక విధానం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి. టీడీపీ హయాంలో ప్రజలు నేరుగా ఇసుక రీచ్‌లకు వెళ్లి.. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా రవాణా చేసుకునేవారని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీని అమలు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా నింపే ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.