యాప్నగరం

ప్రకాశం రాజకీయాల్లో ట్విస్ట్.. పార్టీ మారేది లేదన్న మాజీ మంత్రి

పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు కొట్టిపారేశారు. తాను టీడీపీలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు.

Samayam Telugu 13 Mar 2020, 9:38 pm
ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజురోజుకూ మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీకి గుడ్‌ బై చెప్పేసి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటించగా, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. కరణం బలరాం పార్టీ మార్పు జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపింది. చంద్రబాబు కీలక అనుచరుడిగా గతంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బలరాం టీడీపీని వీడటం తీవ్ర చర్చకు దారి తీసింది.
Samayam Telugu pjimage (30)


Also Read: ‘స్థానిక పోరులో వైసీపీ అరాచకాలు.. రంగంలోకి అమిత్ షా’

అయితే కరణం బలరాం దారిలోనే మరో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు సైతం వైసీపీ గూటికి చేరబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను శిద్దా రాఘవరావు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం శిద్దా మీడియాతో మాట్లాడుతూ.. తాను టీడీపీకి రాజీనామా చేసి, వేరే పార్టీలో చేరబోతున్నట్లు కొన్ని చానళ్లలో చేరబోతున్నట్లు వార్తలు ప్రసారమయ్యాయని తెలిపారు. అయితే తాను టీడీపీలోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

Also Read: కరోనా కోసం 1897 నాటి చట్టం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైసీపీలోకి భారీగా వలసలు పెరుగడం విపక్ష టీడీపీని ఆత్మరక్షణలో పడేసింది. రోజుకొకరు టీడీపీని వీడి అధికార పార్టీ గూటికి చేరుతుండటం చంద్రబాబుకు సవాల్ మారింది. ఈ నేపథ్యంలో తాను టీడీపీలోనే కొనసాగబోతున్నట్లు శిద్దా రాఘవరావు ప్రకటించడం చంద్రబాబుకు కాస్త ఊరట కలిగించే విషయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.