యాప్నగరం

‘మూడు రాజధానులకు ఆ వైసీపీ ఎమ్మెల్యే వ్యతిరేకం, కానీ..’

రాజధానిగా అమరావతి ఉండటం తన ఇష్టమని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ చెప్పారని ఆయన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వెల్లడించారు.

Samayam Telugu 25 Feb 2020, 2:56 pm
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూడు రాజధానులకు తాము సహకరిస్తున్నామంటూ మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఖండించారు. తాను పుట్టుకతోనే కుబేరుడినని, తన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కష్టపడి సంపాదించారని చెప్పారు.
Samayam Telugu cbn 6.


ఈ మేరకు సోమవారం ఆయన విజయవాడలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను, తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్‌ రాజకీయాల్లో నీతి, నిజాయితీలతో పని చేస్తున్నామన్నారు.

Also Read: పులివెందులలో సంచలనం.. చంద్రబాబుకు భారీ షాక్!

రాజధానిగా అమరావతే ఉండాలని కృష్ణప్రసాద్‌ స్పష్టం చెప్పారని వసంత నాగేశ్వరరావు తెలిపారు. కానీ, తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని కాదనలేనని చెప్పినట్లు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించడాన్ని విమర్శించడం అర్థరహితమని కొట్టిపారేశారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయమున్నా పెద్దవాడిగా తనను పిలిచినప్పుడు గౌరవంగా అక్కడి వెళ్లినట్లు చెప్పారు.

Also Read: సీఎం జగన్‌కు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఢిల్లీ టూర్ ఫలితమేనా!

ప్రజలెవరూ వసంత కుటుంబాన్ని శుభకార్యాలకు పిలవొద్దని చెప్పడం ఉమా దిగజారుడుతనానికి నిదర్శనమని నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎంపీ నందిగం సురేష్‌ ఘటనలో కేసులు తాము పెట్టించామని ఉమా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమా తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, మూడు రాజధానులపై తాను స్పందించలేనని వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Also Read: ‘జగనన్న వదిలిన దళిత బాణం ఈయనే.. అడుగుపెడితే అట్రాసిటీ కేసే’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.