యాప్నగరం

ఆ పనికిమాలిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. వైసీపీ ఎంపీపై వెల్లంపల్లి సీరియస్

Kotagiri Sridhar చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉంటే తప్పేంటన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Jul 2022, 7:12 am

ప్రధానాంశాలు:

  • ఎంపీ కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలపై వెల్లంపల్లి స్పందన
  • ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు
  • ముఖ్యమంత్రి జగన్ ప్రజల గురించే ఆలోచిస్తారన్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వెల్లంపల్ల శ్రీనివాస్
ప‌నికిమాలిన ఎంపీ మాట‌లు, ప‌కోడి రామ‌కృష్ణ మాట‌ల‌ను ప్ర‌జ‌లెవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి (Vellampalli Srinivas) శ్రీ‌నివాస్. సొంత పార్టీ ఎంపీ కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించచారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆర్థికంగా స‌హ‌కారం అందించుకోవ‌డానికి ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటే త‌ప్పేంట‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాజ‌కీయాలు చేస్తార‌ని.. మిగిలిన స‌మయాల్లో ప్ర‌జ‌ల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్ర‌మే ఆలోచిస్తార‌న్నారు.
పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు జనవాణి తెలియదని.. ధన వాణి మాత్రమే తెలుసని విమర్శించారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర రాష్ట్రాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. అడ్రస్ లేని వ్యక్తి పవన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఒక్క పది రోజుల ఏపీలో నిద్ర చేసి ఆ తర్వాత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పోలవరం నుంచి ఈ మూడేళ్లలో ఏం చేశామనే అంశాల ప్రదర్శన ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు చెప్పాలని ప్రజలు ప్లీనరీకి వస్తారని.. రాష్ట్ర ప్రజలందరు 8, 9 తేదీలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారన్నారు.

బీజేపీకి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుండడంలో ఎటువంటి దాపరికం లేదని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (Kotagiri Sridhar) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత మూడేళ్లుగా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నామని.. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకీ ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించామని వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు ఇస్తుండడం వల్లే రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపైన మాజీ మంత్రి వెల్లంపల్లి స్పందించారు.

మరోవైపు ఎంపీ శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేశానికి ప్రధాని అయ్యే అవకాశం జగన్‌కు ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన కచ్చితంగా ప్రధాని అవుతారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గుతాయన్నారు. వైఎస్సార్2సీపీ సీట్లు పెరుగుతాయని.. అందుకే ప్రత్యేక హోదా తప్పక తీసుకొస్తామనే నమ్మకం తన అధినేతకు ఉందన్నారు. గతంలో ప్రజలు టీడీపీపై కోపంతో వైఎస్సార్‌సీపీకి ఓట్లేశారని.. కానీ ఇప్పుడు టీడీపీపై కోపంతో కాకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీపై, సీఎం జగన్‌పై ప్రేమాభిమానాలతో ఓటు వేయబోతున్నారని చెప్పుకొచ్చారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.