యాప్నగరం

'మండలి రద్దు జగన్ చేతిలో లేదు.. అంత ఈజీ కాదు'

మండలికి డబ్బుల ఖర్చు అంటున్నారi.. అసెంబ్లీ నడపడానికి ఏడాదికి రూ.150 కోట్లు అవుతాయి.. అసెంబ్లీని కూడా రద్దు చేస్తారా.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే లాయర్‌కు రూ.5 కోట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించిన యనమల.

Samayam Telugu 24 Jan 2020, 9:07 am
శాసనమండలి రద్దు జగన్ సర్కార్ చేతిలో లేదంటున్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. కేవలం మండలిని రద్దు చేస్తున్నట్లు సిఫార్స్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంకు పంపించే వరకు అధికారం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల ముందు పెట్టి ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళుతుందన్నారు. అప్పుడు నోటిఫికేషన్‌ జారీ అయ్యిందన్నారు.
Samayam Telugu jagan


ఇప్పటికే రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని యనమల గుర్తు చేస్తున్నారు. మండలి రద్దుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌ వచ్చే వరకూ మండలి కొనసాగుతుందని.. పనిచేస్తూనే ఉంటుందన్నారు. కాబట్టి మూడు రాజధానుల బిల్లుపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి.. తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వాస్తవానికి ఆర్టికల్‌ 169 కింద మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించి ఆమోదించాలంటే కచ్చితంగా ప్రతిపక్షం సభలో ఉండాలని.. ప్రతిపక్షం లేకపోవడం వల్లే గురువారం ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లలేదని చెప్పుకొచ్చారు.

ఇప్పటికిప్పుడు మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏంటని మాజీ మంత్రి ప్రశ్నించారు. మండలికి డబ్బుల ఖర్చు అంటున్నారని.. అసెంబ్లీ నడపడానికి ఏడాదికి రూ.150 కోట్లు అవుతాయని.. అసెంబ్లీని కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే లాయర్‌కు రూ.5 కోట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సెలెక్ట్‌ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులకు ఆర్డినెన్సు ఇచ్చే అవకాశం ఉండదని యనమల స్పష్టం చేశారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.