యాప్నగరం

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పుపై ఆమంచి సంచలన వ్యాఖ్యలు

డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

Samayam Telugu 23 May 2020, 1:30 pm
విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. కోర్టు సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తుంటే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోట కేంద్రం సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
Samayam Telugu ఆమంచి


డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అన్నారు ఆమంచి. ఆ కేసుపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందని.. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని.. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందన్నారు. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడిని అన్నారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణకు ఆదేశించడం సరికాదన్నారు. చీరాలలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆమంచి ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.