యాప్నగరం

TDPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబు సొంత జిల్లానే

కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి.. ఆపై ఏ పార్టీలో చేరే నిర్ణయం చెబుతానని ఆయన అంటున్నారు. మనోహర్ వైఎస్సార్‌సీపీలో చేరతారన ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 4 Jun 2020, 1:11 pm
టీడీపీకి మరో సీనియర్ నేత షాకిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, చిత్తూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఏఎస్‌ మనోహర్‌ పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి.. ఆపై ఏ పార్టీలో చేరే నిర్ణయం చెబుతానని ఆయన అంటున్నారు. మనోహర్ 1994 పార్టీలో వివిధ పదువుల్లో పనిచేశారు. చిత్తూరు పట్టణ టీడీపీ కన్వీనర్‌గా పని చేశారు.. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో సీకేబాబుపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1995లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సీకేబాబుపై రెండోసోరా పోటీ చేసి ఓడిన ఆయన.. 2004 ఎన్నికల్లో విజయం సాధించారు.
Samayam Telugu మనోహర్ (File Photo)


మనోహర్ ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్‌ రాకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. చిత్తూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత మనోహర్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు హాజరైన ఆయన ఉన్నట్టుండి పార్టీకి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. మనోహర్ వైఎస్సార్‌సీపీలో చేరతారన ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.