యాప్నగరం

వైసీపీలోకి వెళ్లను.. ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ నేత

రెండు రోజులుగా వైఎస్సార్‌సీపీలోకి వెళతారని జోరుగా ప్రచారం. క్లారిటీ ఇచ్చిన టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి. టీడీపీలో కొనసాగుతానని.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్న బీసీ.

Samayam Telugu 19 Mar 2020, 7:17 am
వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి. తాను టీడీపీలోనే కొనసాగుతానని..కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను వైఎస్సార్‌సీపీకి చెందిన కీలక నేతను కలిసినట్లు ప్రచారం జరిగిందని.. తాను ఎవర్నీ కలవలేదన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు.
Samayam Telugu bc.


Read Also:
బొ..లో నాయకత్వం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రెండు రోజుల క్రితం బీసీ జనార్థన్‌రెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన వైఎస్సార్‌సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినట్లు చర్చ జరిగింది. దీంతో ఆయనే స్పందించారు.. తాను టీడీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పడంతో అనుచరులు, అభిమానులకు క్లారిటీ ఇచ్చినట్లైంది.

బీసీ జనార్థన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యేగా 2014లో గెలిచారు. పార్టీకి ముఖ్యమైన నేత. 2014లో జిల్లావ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీచినా.. ఈయన మాత్రం ప్రత్యర్థిపై భారీ మెజార్టీతోనే గెలిచారు. 2014 ఎన్నికల్లో జనార్థన్‌రెడ్డికి సహకరించి.. విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి పంపకాల్లో ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పదవి విషయంలోనూ 2019 ఎన్నికల ముందు జనార్థన్‌రెడ్డి అలకబూనారు. అధిష్టానం పిలిచి మాట్లాడటంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత చల్లా వైఎస్సార్‌సీపీ గూటికి చేరి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఈయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.