యాప్నగరం

పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్య నేత షాక్.. వైసీపీలో చేరిక

ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన వెంకట్రామయ్య. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక. పవన్ కళ్యాణ్ కోసం గాజువాక సీటును త్యాగం చేసిన వెంకట్రామయ్య.

Samayam Telugu 11 Mar 2020, 7:05 am
విశాఖజిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. విశాఖలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. అనంతరం విజయసాయి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని.. విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తానన్నారు వెంకట్రామయ్య.
Samayam Telugu ramaiah


ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీకి నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్ రాజు తదితరులు జనసేనను వీడారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి బాటలోనే విశాఖపట్నం గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య కూడా జనసేనకు గుడ్ బై చెప్పారు. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో చేరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలు కావడంతో వైఎస్సార్‌సీపీలో చేరారు.

చింతలపూడి వెంకట్రామయ్య 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 17 వేల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. తర్వాత వెంకట్రామయ్య 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం గాజువాక సీటును త్యాగం చేశారు.. ఆయన పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాకలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నియోజకవర్గవలో లక్షకుపైగా సభ్యత్వాలు రావడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత ఏం జరిగిందో ఏమో పార్టీకి గుడ్ బై చెప్పారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.