యాప్నగరం

విశాఖలో టీడీపీకి మరో షాక్.. పార్టీ జిల్లా అధ్యక్షుడి రాజీనామా

టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో సీనియర్ నేత.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరనున్న రమేష్. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పంచకర్ల.

Samayam Telugu 11 Mar 2020, 10:39 am
స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పంచకర్ల రమేష్‌బాబు పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశంకానున్నారు.. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పంచకర్ల రమేష్ బాబు వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవాళో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Samayam Telugu ramesh


Read Also: మాజీ మంత్రి గంటాకు బిగ్ షాక్.. ఈ నెల 16న..

పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన సంగతి తెలిసిందే. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటుగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

రమేష్‌బాబు 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడారు. ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అనుచరులతో సమావేశమై పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.