తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మళ్లీ షాకిచ్చారు. కాకినాడ టీడీపీ ఆఫీసులో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షకు డుమ్మా కొట్టారు. శుక్రవారం ముమ్మిడి వరం, రామచంద్రాపురం, తుని నేతలతో టీడీపీ అధినేత సమావేశమయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గం సమీక్షకు పార్టీ ఇంఛార్జ్గా ఉన్న తోట త్రిమూర్తులు రాలేదు. దీంతో వచ్చిన నేతలతోనే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. Read Also: జగన్, కేసీఆర్లకు తేడా అదే.. ఏపీ సీఎంపై భట్టి ప్రశంసలు
తోట త్రిమూర్తులు వ్యవహారంపై జిల్లా నేతలతో చంద్రబాబు చర్చించారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై జ్యోతుల నెహ్రూ, చినరాజప్పతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్రిమూర్తులు వైఖరిపై దాదాపు గంటపాటూ నేతలతో బాబు చర్చించారట. అలాగే వరపుల రాజా పార్టీకి రాజీనామా చేయడంతో ప్రత్తిపాడుకు టీడీపీ కొత్త ఇన్చార్జ్ నియామకంపైనా చర్చ జరిగింది.
Don't Miss: జగన్ పాలనకు వందకు వంద పడాల్సిందే.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు తోట త్రిమూర్తులు సమీక్షకు హాజరుకాకపోవడంపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు స్పందించారు. త్రిమూర్తులు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటారని తాను భావించడం లేదని.. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేకపోయారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ కేడర్కు కొత్త ఉత్తేజం వచ్చిందని.. అధినేత ఇచ్చిన భరోసా, స్ఫూర్తితోనే ముందుకు సాగుతామన్నారు.
తోట త్రిమూర్తులు వ్యవహారంపై జిల్లా నేతలతో చంద్రబాబు చర్చించారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై జ్యోతుల నెహ్రూ, చినరాజప్పతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్రిమూర్తులు వైఖరిపై దాదాపు గంటపాటూ నేతలతో బాబు చర్చించారట. అలాగే వరపుల రాజా పార్టీకి రాజీనామా చేయడంతో ప్రత్తిపాడుకు టీడీపీ కొత్త ఇన్చార్జ్ నియామకంపైనా చర్చ జరిగింది.
Don't Miss: జగన్ పాలనకు వందకు వంద పడాల్సిందే.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు తోట త్రిమూర్తులు సమీక్షకు హాజరుకాకపోవడంపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు స్పందించారు. త్రిమూర్తులు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటారని తాను భావించడం లేదని.. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేకపోయారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ కేడర్కు కొత్త ఉత్తేజం వచ్చిందని.. అధినేత ఇచ్చిన భరోసా, స్ఫూర్తితోనే ముందుకు సాగుతామన్నారు.