యాప్నగరం

ఢిల్లీలో వంగవీటి రాధాకృష్ణ.. కారణం ఏంటంటే!

ఢిల్లీ వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. జేఏసీ సభ్యులతో కలిసి హస్తినలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్నారు. రాధా వారితో కలిసి కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Samayam Telugu 3 Oct 2020, 6:42 am
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఢిల్లీ వెళ్లారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులకు అండగా నిలిచారు. జేఏసీ సభ్యులతో కలిసి హస్తినలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు రాజ్ ఘాట్ దగ్గర మహాత్మగాంధీకి అమరావతి జేఏసీ సభ్యులు నివాళులు అర్పించారు. ఏపీ రాజధానిగా అమరవతినే కొనసాగించాలంటూ మౌన ప్రదర్శన చేపట్టారు.
Samayam Telugu వంగవీటి రాధా


ఈ నిరసన కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆరె శివా రెడ్డి, తిరుపతి రావు, వంగవీటి రాధాకృష్ణ , రైతులు, ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా కొంసాగించాలని శాంతియుత మౌన ప్రదర్శన ద్వారా ప్రధాన మంత్రికి తమ నిరసన తెలుపుతున్నామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. వంగవీటి మొదటి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు.. వారితో కలిసి కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన కూడా రాజధాని అమరావతిలోనే కొనసాగించాలనే వాయిస్ వినిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.