యాప్నగరం

మాజీ ఎంపీ హర్షకుమార్‌కు కరోనా పాజిటివ్

మాజీ ఎంపీ హర్షకుమార్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samayam Telugu 18 Aug 2020, 12:03 am
కరోనా వైరస్ మహమ్మారి సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఏపీలోనూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వైద్యం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిసింది.
Samayam Telugu హర్షకుమార్


‘‘ఫ్రెండ్స్.. నాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. నా కోడళ్లు ఇద్దరికీ వచ్చింది. నా మనుమరాలికి కూడా వచ్చింది. ఎవరూ బాధ పడవద్దు. అందరూ ప్రేయర్ చేయండి. దయచేసి ఎవరు ఫోన్ చేయకండి, ఇంటి వద్దకు కుడా రాకండి సోదరులారా. మరి కొద్ది రోజుల్లో దేవుని ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తా’’ అని హర్ష కుమార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

కాగా, హర్ష కుమార్ ఇటీవలి కాలంలో దళిత సమస్యలపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసులో బాధితుడి పక్షాన నిలబడి అండగా నిలబడ్డారు. ఇటీవలే ప్రభుత్వం న్యాయం చేయట్లేదనని, తాను నక్సలైట్లలో చేరి ప్రతికారం తీర్చుకుంటానని రాష్ట్రపతికి బాధిత యువకుడు లేఖ రాయగా.. హర్షకుమార్ వెళ్లి యువకుడిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కరోనా బారిన పడగా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.