యాప్నగరం

పోలీసులపైనే కేసు పెట్టిన మాజీ ఎంపీ

తనపై కేసులు నమోదు చేసి, ఇబ్బంది పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ వెల్లడించారు.

Samayam Telugu 17 Feb 2020, 4:55 pm
తన మీద తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టిన పోలీసు, న్యాయ శాఖ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎంపీ హర్ష కుమార్ వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో హర్షకుమార్‌ కేసు నమోదు చేశారు. 48 రోజుల పాటు తాను అన్యాయంగా జైలులో ఉండేందుకు కారణమైన.. న్యాయ, పోలీసు శాఖ అధికారులపై కేసులు నమోదు చేయాలని హర్షకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Samayam Telugu harsha


Also Read: ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ కేసులో ట్విస్ట్.. యువకుడి ఆత్మహత్యాయత్నం

న్యాయశాఖ అధికారులు తనను ప్రత్యర్థిగా చూశారని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలన్నారు. ప్రభుత్వం, పోలీసులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని హర్షకుమార్ స్పష్టం చేశారు.

ప్రతి సోమవారం తాను స్టేషన్‌కు వెళ్లి అక్కడ సంతకం పెట్టాలని ఆదేశించారని హర్షకుమార్ మండిపడ్డారు. తనపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులు పెట్టిన వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Also Read: రేపు సీఎం జగన్ పర్యటన.. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.