యాప్నగరం

ఆ రోడ్డులో జగన్ కాన్వాయ్ వెళ్లగలిగితే రాజకీయాలు మానేస్తా.. మాజీ ఎంపీ సవాల్

సీఎం జగన్ కాన్వాయ్‌తో రాగలిగితే.. తనను ఏం చేయమన్నా సిద్ధమని.. సీఎం జగన్‌కు చాలెంజ్‌ చేస్తున్నాను అన్నారు. రాజకీయాలు మానేయమన్నా మానేస్తాను అంటున్నారు.

Samayam Telugu 24 Oct 2020, 6:53 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ హర్షకుమార్ సవాల్ విసిరారు. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకూ గోదావరి ఫోర్త్‌ బ్రిడ్జిపై సీఎం కాన్వాయ్‌తో రాగలిగితే.. తనను ఏం చేయమన్నా సిద్ధమని.. సీఎం జగన్‌కు చాలెంజ్‌ చేస్తున్నాను అన్నారు. రాజకీయాలు మానేయమన్నా మానేస్తా.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్డు మీద లారీల భాగాలు కూడా విరిగిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టిన తర్వాత ఇంత అధ్వానమైన రోడ్లను చూడలేదన్నారు.
Samayam Telugu సీఎం జగన్


ఇటీవల కురిసిన వర్షాలకు కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్లే గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్‌ దెబ్బతిందని హర్షకుమార్ చెబుతున్నారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం రావడానికి ఐదారు గంటలు పడుతోందన్నారు మాజీ ఎంపీ. రాష్ట్రం బాధ్యత తీసుకోవాలని.. టోలు వసూలు చేసేవారు, రోడ్డు బాగుండేలా చూడాలి అన్నారు. రోడ్డు బాగు చేసే వరకూ ప్రతి టోల్‌ ఆపేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడ రోడ్డు పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని.. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఆ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.