యాప్నగరం

BJP, టీడీపీలు కలిసి పోటీ చేయొచ్చు.. జేసీ సంచలన వ్యాఖ్యలు

Jc Diwakar Reddy| రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు లేరు.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు గొప్పవాళ్లు.. చంద్రబాబు కూడా అదే కోవకు చెందినవారు'

Samayam Telugu 15 Oct 2019, 9:38 pm
టీడీపీ-బీజేపీల పొత్తుల అంశంపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తుకు అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు లేరని.. మోదీ, అమిత్ షాలు గొప్పవాళ్లు.. చంద్రబాబు కూడా అదే కోవకు చెందినవారు అన్నారు. ఎవరు జుట్టు పట్టుకుంటాడో, ఎవరి కాళ్లు పట్టుకుంటాడో తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu diwakar


Read Also: Ys Jaganపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డి

ఇటు ఎన్నికల్లో మార్పు కావాలని జగన్‌కు ప్రజలు ఓట్లేశారని.. ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలకు రెండు నుంచి ఐదు వేల ఓట్లు మెజార్టీ వచ్చాయంటే నమ్మొచ్చు..కానీ ఊరు పేరు లేనివాడికి కూడా ముప్పై వేలు, 25 వేలు ఓట్లొచ్చాయంటే మోదీ మంత్రదండమే కారణమన్నారు జేసీ. జగన్ పాలనపై చెప్పాలంటే మరో ఆరు నెలలు గడవాలని.. ఆయనకు అనుభవం లేదని. మంచి, చెడు చెప్పేవారు లేరు అన్నారు.

Also Read: 'జగన్ ఏం చెప్పారో మర్చిపోయారా.. రైతు భరోసా రూ.18,500 ఇవ్వాలి'

కొద్ది రోజుల క్రితమే టీడీపీతో పొత్తుకు ద్వారాలు మూసుకుపోయాయని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదని.. వచ్చే స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసిందని.. టీడీపీకి ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని, మళ్లీ తెరుచుకునే అవకాశమే లేదన్నారు. బీజేపీ నేతలు అలా అంటే జేసీ మాత్రం ఇలా అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.